కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అబ్దుల్లాపూర్మెట్లోని విజయవాడ జాతీయ రహదారిపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించారు.
రైతులకు మద్దతుగా తెరాస ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళన చేయడం జరిగిందని వెల్లడించారు. కేంద్రం ఆవలంబిస్తున్న రైతు వ్యతిరేక నిర్ణయాలను వెంటనే వెనక్కుతీసుకోవలని డిమాండ్ చేశారు. రైతు నడ్డివిరిచే విధంగా ఉన్న ఈ చట్టాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు.