కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కరోనాను నివారించడానికి రంగంలోకి దిగారు. కాలనీల్లో స్వయంగా రసాయనాలు పిచికారీ చేశారు. నియోజకవర్గంలోని మూసాపేట్, అల్లాపూర్లో జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందితో కలిసి సోడియం హైపోక్లోరైట్ను కాలనీల్లో పిచికారీ చేశారు.
కరోనా కట్టడికి ఆ ఎమ్మెల్యే ఏం చేశారో తెలుసా? - mla madhavaram krishna rao
ప్రజాప్రతినిధి అంటే అధికారులు, సిబ్బందితో పని చేయిస్తారు. కానీ ఇక్కడ ఆయనే పని చేశారు. కరోనా వైరస్ను తరిమికొట్టడానికి సోడియం హైపోక్లోరైట్ను వీధుల్లో పిచికారీ చేశారు. రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారు. అయనే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.
రసాయనాలు పిచికారి చేసిన ఎమ్మెల్యే
కరోనా వైరస్ను అరికట్టాలని చెబుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతతోపాటు కార్పొరేటర్లు తూము శ్రావణ్ కుమార్, సభీహా గౌసుద్దీన్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కోడిమాంసం, గుడ్ల సరఫరాపై మంత్రి తలసాని సమీక్ష