భాజపా ప్రభుత్వం ప్రజలకు తెలియని రీతిలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ పోతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. యూపీఏ ప్రభుత్వంలో క్రూడాయిల్, సిలిండర్లపై పది పైసలు పెంచితే... భాజపా ఇప్పుడు వందల రూపాయలు పెంచుతూ పోతోందని ఆయన మండిపడ్డారు.
'భూముల విషయం కాకుండా ప్రజా సమస్యలపై స్పందించాలి' - jagga reddy comments on bandi sanjay
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు తెలియని రీతిలో క్రూడాయిల్, గ్యాస్ ధరలు పెంచుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై రాష్ట్ర భాజపా అధ్యక్షులు బండి సంజయ్ స్పందించాలని కోరారు. ఆలయ భూములే కాకుండా ప్రజల సమస్యలను కూడా పట్టించుకోవాలని అన్నారు.

'భూముల విషయం కాకుండా ప్రజా సమస్యలపై స్పందించాలి'
ఈ విషయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. క్రూడాయిల్ ధరలపై బండి సంజయ్ ఎందుకు మాట్లాడడం లేదన్న జగ్గారెడ్డి.. కాళీ మాతా భూముల గొడవ ముఖ్యమా.. ధరల పెరుగుదలతో ప్రజల ఇబ్బందులు ముఖ్యమా అని ప్రశ్నించారు.
ఇదీ చూడండి :గోల్డెన్ హవర్లో అత్యవసర వైద్యానికి చర్యలు: సీఎస్