తెలంగాణ

telangana

ETV Bharat / state

ముషీరాబాద్​లో పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ - MLA GOPAL BESTHA DISTRIBUTED ESSENTIAL INGREDIENTS TO POOR PEOPLE

ముషీరాబాద్ నియోజకవర్గంలోని పేదలకు, నిరాశ్రయులకు ఎమ్మెల్యే గోపాల్ బెస్త నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటించాలని ఆయన సూచించారు.

ప్రజలందరూ సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలి : ఎమ్మెల్యే
ప్రజలందరూ సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలి : ఎమ్మెల్యే

By

Published : Apr 6, 2020, 8:34 AM IST

Updated : Apr 6, 2020, 8:48 AM IST

కోవిడ్-19 వైరస్ నుంచి తమను తాము రక్షించుకునే అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని ముషీరాబాద్ శాసనసభ్యులు గోపాల్ బెస్త అన్నారు. నియోజకవర్గంలోని పేద ప్రజలకు వ్యాపారవేత్త అడుసుమిల్లి రాజేంద్ర ప్రసాద్, హిదాయత్ పౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

మన వంతుగా సహకరించాలి కదా...

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించుకోవడానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ఆయన అన్నారు. ప్రజలు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని తప్పక పాటించాలని గాంధీనగర్ కార్పొరేటర్ పద్మ బెస్త విజ్ఞప్తి చేశారు. తమ ఇంటితో పాటు పరిసరాలూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తెరాస యువజన నేత జై సింహ , ఫౌండేషన్ ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజలందరూ సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలి : ఎమ్మెల్యే

ఇవీ చూడండి : రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తోన్న కరోనా

Last Updated : Apr 6, 2020, 8:48 AM IST

ABOUT THE AUTHOR

...view details