తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రార్థనా స్థలాలు, దేవాలయాలకు శానిటైజర్ పంపిణీ - Nampally constituency

భాగ్యనగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలువురు దాతలు పలు విధాలుగా సాయం చేస్తున్నారు. ఈ తరుణంలో ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ మాజీద్ హుస్సేన్ నాంపల్లి నియోజకవర్గంలోని అన్ని ప్రార్థనా స్థలాలు, దేవాలయాలకు శానిటైజర్​ను పంపిణీ చేశారు.

MLA distributed sanitizer to nampally worship places and temples
MLA distributed sanitizer to nampally worship places and temples

By

Published : Jun 9, 2020, 10:17 PM IST

హైదరాబాద్ నగరంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో నాంపల్లి నియోజకవర్గంలోని అన్ని ప్రార్థనా స్థలాల్లో స్ప్రే చేసేందుకు శానిటైజర్​, పిచికారి యంత్రాలని పంపిణీ చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ మాజీద్ హుస్సేన్ ఆధ్వర్యంలో వాటిని అందించారు.

నాలుగు దేవాలయాలతోపాటు రెండు చర్చీలు, 10 మజీద్​లకు అందించారు. మిగితా ప్రార్థనా స్థలాల్లోకి నేరుగా వారి కార్యకర్తలు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ద్రావణం అయిపోయిన తర్వాత జీహెచ్ఎంసీకి ఎల్లప్పుడు అందిస్తామని ఎమ్మెల్యే అన్నారు.

ఇదీ చూడండి :'ఆలేరును ఏడారి చేస్తోన్న కేసీఆర్‌ సర్కార్'‌

ABOUT THE AUTHOR

...view details