తెలంగాణ

telangana

ETV Bharat / state

పేద పాస్టర్లకు నిత్యావసరాలు అందించిన ఎమ్మెల్యే నాగం - బంజారాహిల్స్​లో నిత్యావసరాలు అందించిన ఎమ్మెల్యే నాగం

హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని ఏసీబీ కార్యాలయం వద్దనున్న షారోన్​ చర్చిలో బీఎస్​ డేవిడ్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దానం నాగేందర్​... దాదాపు 400 మంది పేద పాస్టర్లకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

mla dhanam distributed grocery to poor at banjarahills
పేద పాస్టర్లకు నిత్యావసరాలు అందించిన ఎమ్మెల్యే నాగం

By

Published : May 30, 2020, 8:10 PM IST

లాక్​డౌన్​ కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని... వాళ్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని.. ఎమ్మెల్యే దానం నాగేందర్​ అన్నారు. హైదరాబాద్​ బంజారాహిల్స్​లో ఏసీబీ కార్యాలయం వద్దనున్న చర్చిలో పాస్టర్లకు ఆయన బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

లాక్​డౌన్​ వల్ల రెండు నెలల నుంచి చర్చిలు మూసివేసినందున పాస్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. బీఎస్​ డేవిడ్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 400 మంది పాస్టర్లకు నిత్యావసరాలను అందజేశారు. కేసీఆర్​తో చర్చించి పాస్టర్లకు స్టైపండ్​ ఇచ్చేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:'దోషం తొలిగిస్తాడనుకుంటే కోరిక తీర్చమన్నాడు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details