తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే దానం - khairatabad Mla danam Nagendhar

ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధి ఇందిరానగర్​లో సుమారు రూ.20 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ కాజా సూర్యనారాయణతో కలిసి దానం నాగేందర్ ప్రారంభించారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.

రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే దానం, కార్పొరేటర్ కాజా
రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే దానం, కార్పొరేటర్ కాజా

By

Published : Sep 13, 2020, 4:51 PM IST

పేదలకు సంక్షేమ పథకాలను అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇందిరానగర్​లో 20 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్డు పనులను దానం నాగేందర్ ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలోనే కాక రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోనూ పేద ప్రజలకు అభివృద్ధి పథకాలను అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగుతున్నారని పేర్కొన్నారు.

అందరికీ సంక్షేమ పథకాలు..

ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తూ.. సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదని దానం ప్రశంసించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, తెరాస కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇవీ చూడండి :ఎల్​ఆర్​ఎస్​కు భారీ సంఖ్యలో దరఖాస్తులు

ABOUT THE AUTHOR

...view details