తెలంగాణ

telangana

ETV Bharat / state

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ - హైదరాబాద్ అల్వీన్ కాలనీలో రక్తదాన శిబిరం ఏర్పాటు

హైదరాబాద్ ఆల్విన్ కాలనీలో కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్, యువ నాయకులు రామకృష్ణ గౌడ్​ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రారంభించారు.

mla gandhi started blood donation camp
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ

By

Published : May 7, 2020, 5:36 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో రక్త నిధులు తగ్గిపోయాయని మంత్రి కేటీఆర్ సలహా మేరకు ఆల్విన్ కాలనీలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్, యువ నాయకులు రామకృష్ణ గౌడ్. ఈ కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రారంభించారు.

కరోనా సమయంలో ఎవరూ రక్తం కోసం అవస్థలు పడకూడదని మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకే అన్ని డివిజన్​లలో తెరాస నాయకులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని తెలంగాణ ప్రభుత్వం 12 కిలోల బియ్యంతో పాటు 1500 రూపాయలను అందజేస్తోందని వివరించారు.

ఇవీ చూడండి:విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి ​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details