లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో రక్త నిధులు తగ్గిపోయాయని మంత్రి కేటీఆర్ సలహా మేరకు ఆల్విన్ కాలనీలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్, యువ నాయకులు రామకృష్ణ గౌడ్. ఈ కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రారంభించారు.
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ - హైదరాబాద్ అల్వీన్ కాలనీలో రక్తదాన శిబిరం ఏర్పాటు
హైదరాబాద్ ఆల్విన్ కాలనీలో కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్, యువ నాయకులు రామకృష్ణ గౌడ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రారంభించారు.
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ
కరోనా సమయంలో ఎవరూ రక్తం కోసం అవస్థలు పడకూడదని మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకే అన్ని డివిజన్లలో తెరాస నాయకులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని తెలంగాణ ప్రభుత్వం 12 కిలోల బియ్యంతో పాటు 1500 రూపాయలను అందజేస్తోందని వివరించారు.
ఇవీ చూడండి:విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
TAGGED:
mla arikepoodi gandhi