కరోనా కారణంగా దేశంలో రక్త నిల్వలు తగ్గిపోతున్నందున యువత రక్త దానం చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. కూకట్ పల్లి వివేకానంద నగర్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ... రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ - ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
మంత్రి కేటీఆర్ సూచనల మేరకు హైదరాబాద్ కూకట్పల్లిలోని వివేకానంద నగర్ డివిజన్లో తెరాస నాయకులు రంగారావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 150 మంది తెరాస కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
![రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ MLA GANDHI STARTED BLOOD DONATION CAMP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7055161-830-7055161-1588587256741.jpg)
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ
కేవలం ప్రారంభించడమే కాకుండా రక్తదానం చేసి నాయకులు, కార్యకర్తలు కూడా రక్త దానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది తెరాస నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు.
ఇవీ చూడండి:హైదరాబాద్లో ఒక్క రోజులోనే 20 కేసులు