తెలంగాణ

telangana

ETV Bharat / state

"జనవరి నాటికి భగీరథ పనులు పూర్తిచేయాలి" - The mission of Bhagirathha is to complete the internal work of all villages by January

జనవరి నాటికి మిషన్ భగీరథ అంతర్గత స్థిరీకరణ పనులు పూర్తి కావాలని ఈఎన్​సీ కృపాకర్ రెడ్డి తెలిపారు. అన్ని జిల్లాల ఎస్ఈ, ఈఈలతో ఎర్రమంజిల్​లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయం నుంచి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.

mission bhagiratha works should be completed by January
జనవరి నాటికి భగీరథ అంతర్గత పనులు పూర్తిచేయాలి

By

Published : Dec 7, 2019, 11:58 PM IST

ప్రతి గ్రామంలో జనవరి నాటికి మిషన్​ భగీరథ అంతర్గత పనులు పూర్తి చేయాలని ఈఎన్​సీ కృపాకర్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల ఎస్ఈ, ఈఈలతో ఎర్రమంజిల్​లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. మిషన్​ భగీరథ నీటి వినియోగంపై ప్రజలను మరింత చైతన్యం చేయాలన్న ఆయన, స్థిరీకరణ పనుల్లో భాగంగా పాత ఓవర్ హెడ్ ట్యాంక్​లకు అవసరమైన మరమ్మత్తులు చేసి నీటి సరాఫరాకు ఉపయోగించాలని స్పష్టం చేశారు.

పాత, కొత్త ఓవర్ హెడ్ ట్యాంక్​ల వద్ద నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కృపాకర్ రెడ్డి చెప్పారు. గ్రామంలోని ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ ఉండేలా చూడాలని, ఇప్పటికే భగీరథ నీరు సరాఫరా అవుతున్న గ్రామాల్లోని ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులను ఈ పనుల్లో భాగం చేయాలని పేర్కొన్నారు. భగీరథ నీటి నాణ్యతపై స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామాల్లో పర్యటించి భగీరథ నీటి సరాఫరా తీరును పరిశీలించాలని ఇంజినీర్లను ఆదేశించారు.

ఇదీ చూడండి : ' దీక్ష భూమి వరకు అంబేడ్కర్ సమతా యాత్ర'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details