మానసిక వ్యాధితో బాధపడుతూ ఇంటి నుంచి ఆరేళ్ల క్రితం వెళ్లిపోయిన ఓ వ్యక్తిని ఏపీలోని గుంటూరు జిల్లా న్యాయ సేవా అధికారులు కుటుంబం చెంతకు చేర్చారు. జిల్లా న్యాయమూర్తి గోపీచంద్ సమక్షంలో కుటుంబ సభ్యులకు అతన్ని సోమవారం అప్పగించారు.
గుంటూరులోని గోరంట్లకు చెందిన శివనాగరాజు... ఆరేళ్ల క్రితం ఇంటి నుంచి మధ్యప్రదేశ్లోని బిలాస్పూర్ వెళ్లిపోయాడు. మానసిక పరిస్థితి సరిగ్గా లేని ఆయనను.. అక్కడ పోలీసులు మానసిక వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. చికిత్స తర్వాత అతను తన చిరునామా చెప్పటంతో అక్కడి అధికారులు గుంటూరు న్యాయ సేవా అధికారులకు సమాచారం అందించారు.