తెలంగాణ

telangana

ETV Bharat / state

బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు బీమా సొమ్ము పంపిణీ

బోటు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లి అన్నారు. బోటు ప్రమాదంలో చనిపోయిన ఐదుగురు భవన నిర్మాణ కార్మికులు, ఇతర ప్రమాదాల్లో మృతిచెందిన మరో నలుగురి కుటుంబసభ్యులకు కార్మిక శాఖ తరఫున రూ.6లక్షల 30వేలు మంత్రులు అందించారు.

By

Published : Oct 29, 2019, 9:45 PM IST

బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు బీమా సొమ్ము పంపిణీ

గోదావరి నదిలో కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో మృతి చెందిన తెలంగాణ వాసుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​ రావు, మల్లారెడ్డి తెలిపారు. కార్మికభవన్​లో జరిగిన కార్యక్రమంలో పడవ ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురు మృతుల కుంటుంబాలకు కార్మిక శాఖ తరఫున రూ.6లక్షల 30 వేలు బీమా సొమ్ము అందించారు. మిగిలిన మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షలు, ఏపీ ప్రభుత్వం నుంచి మరో రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం బీమా చేయించుకున్న వారికే సాయం అందించామని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. కార్మికులు బీమా చేయించుకుంటే వచ్చే ఉపయోగాలను వివరిస్తూ... అవగాహన కల్పిస్తామన్నారు.

బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు బీమా సొమ్ము పంపిణీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details