రాష్ట్రంలో ధాన్యంసహా ఇతర వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది ఖరీఫ్ కొనుగోళ్ల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా వ్యవసాయ శాఖాధికారులతో బీఆర్కే భవన్లో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్ దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న ధాన్యంపై నిఘా పెట్టాలని మంత్రులు సూచించారు.
రాష్ట్రంలో పండిన పంటలో 25 నుంచి 30 శాతం మాత్రమే కొనాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలన్న సత్సంకల్పంతో ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. దళారులు, వారికి సహకరిస్తున్న అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.