తెలంగాణ

telangana

ETV Bharat / state

Water War: ఏపీ అక్రమ ప్రాజెక్టును అడ్డుకుంటాం'

కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందని మంత్రులు నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆరోపించారు. చట్ట వ్యతిరేకంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారని విమర్శించారు. ఏపీ నీటి చౌర్యాన్ని తప్పకుండా అడ్డుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు.

By

Published : Jun 26, 2021, 12:02 PM IST

Updated : Jun 26, 2021, 12:15 PM IST

Minister Puvvada Ajay Kumar, NIRANJAN REDDY
Water War: ఏపీ అక్రమ ప్రాజెక్టును అడ్డుకుంటాం'

కృష్ణా నదిలో నీటి హక్కులను వదులుకునే ప్రసక్తే లేదని... మా నీటిని ఎలా తీసుకోవాలో మాకు తెలుసని మంత్రులు నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఏపీ సర్కారు తలపెట్టిన ప్రాజెక్టులను ఎట్టిపరిస్థితుల్లో ఆపుతామని అన్నారు. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయం తన నివాసంలో మంత్రి మీడియాతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

'ఏపీ తలపెట్టిన అక్రమ ప్రాజెక్టును అడ్డుకుంటాం'

శ్రీశైలం డెడ్ స్టోరేజీ నుంచి రోజు మూడు టీఎంసీలు నీరు తరలించేందుకు... రాయలసీమ ఎత్తిపోతల పథకం రూపకల్పన, నిర్మాణం పూర్తి చట్ట, రాజ్యాంగ విరుద్ధమని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు నెలకొన్న నేపథ్యంలో వీధి పోరాటాలు ఉండవన్నారు. కేంద్రం జోక్యం చేసుకుని పరిష్కరించాలని సూచించారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉన్న జల వనరులు ముందు చూపుతో వాడుకుందామన్న కోణంలో తెలంగాణ ప్రభుత్వం... ఆంధ్రప్రదేశ్‌కు స్నేహ హస్తం అందించిందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఏమైనా ప్రాజెక్టులు నిర్మించాలంటే.. కేంద్రం అనుమతి తీసుకుని నీటి కేటాయింపులు చేసుకోవాలి తప్ప... ఇష్టా రాజ్యంగా మొండి వైఖరి ప్రదర్శిస్తే తాము అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

ఈ విషయాన్ని ప్రధాని సహా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన దృష్ట్యా... ఇరు రాష్ట్రాలను పిలిచి సామరస్యంగా పరిష్కరించవచ్చని నిరంజన్‌రెడ్డి అన్నారు. రెండు కొట్లాడుకోవాలని కేంద్రం చూస్తోందని విమర్శించారు. సాధారణంగా ఇలాంటి వివాదాలు ఉత్పన్నమైనప్పుడు వాటర్ బోర్డ్ మేనేజ్​మెంట్ సుమోటోగా వెళ్లి తనిఖీ చేస్తే ప్రభుత్వ పధాన కార్యదర్శి జైలుకు వెళ్లరా అని ప్రశ్నించారు.

న్యాయస్థానంలో స్టే ఉండగా రాయసీమ ప్రాజెక్టులు పనులు ఎలా చేస్తారని మంత్రి ధ్వజమెత్తారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్టు నుంచి ఆరు టీఎంసీలు... ఉపయోగించుకునే అవకాశం ఉన్నందున జోగులాంబ బ్యారేజీ వద్ద నీరు ఆపుకుంటామని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. దాబాయింపు మాటలు చెల్లుబాటు కావని ఎద్దేవా చేశారు. మీ వైఖరి ఏందో చెప్పాలని కోరారు. తెలంగాణ మీ పాలనలో ఉన్న సమైక్యం రాష్ట్రం కాదని నిరంజన్‌రెడ్డి చెప్పారు. దబాయించైనా జోగులాంబ ఆనకట్టను కడతామని.. ఎవరు అడ్డొస్తారో చూసుకుంటామని వెల్లడించారు.

ప్రశాంత్‌రెడ్డి మాటలు వందశాతం నిజం

'ఏపీ తలపెట్టిన అక్రమ ప్రాజెక్టును అడ్డుకుంటాం'

ఆంధ్రప్రదేశ్​ నీటి చౌర్యాన్ని తప్పకుండా అడ్డుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చెప్పారు. అబద్ధాలు చెబుతూ ఏపీ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందని... జగన్‌ అక్రమ నీళ్ల తరలింపు పరాకాష్టకు చేరిందని విమర్శించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వైఎస్ దొంగ అయితే.. జగన్ గజదొంగ అన్న వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని... వాటిని సమర్థిస్తున్నట్లు పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

"గతంలోనే పోతిరెడ్డిపాడుపై కేసీఆర్ పోరాటం చేశారు. జగన్‌ అక్రమ నీళ్ల తరలింపు పరాకాష్టకు చేరింది. అబద్ధాలు చెబుతూ ఏపీ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. కేంద్రంలోని భాజపా సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఏపీలో ఒకలా తెలంగాణలో మరోలా భాజపా మాట్లాడుతోంది. ఆనాడే వైఎస్ తెలంగాణ సమాజాన్ని చిన్నచూపు చూశారు. తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కేసీఆర్ ఆకాంక్షించారు. భేషజాలకు పోకుండా న్యాయం చేద్దామని కేసీఆర్ చెప్పారు. రాయలసీమకు నీళ్లు ఇస్తామనే మాటలను ఏపీ వక్రీకరిస్తోంది. రెండు రాష్ట్రాల నీటి వాటాలు ఇంకా తేలలేదు. వైఎస్ హయాంలో అద్భుతమైన ప్రాజెక్టులు కట్టామని చెప్పుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఒక్క ఎకరానికైనా నీరు వచ్చిందా. వైఎస్‌పై మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాటలు వందశాతం నిజం. తెలంగాణ ప్రజల హక్కుల కోసం మేం మాట్లాడుతున్నాం. ఏపీ నీటి చౌర్యాన్ని తప్పకుండా అడ్డుకుంటాం."

- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఇదీ చూడండి:KTR: కేటీఆర్‌ చొరవ.. చిన్నారికి పునర్జన్మ

Last Updated : Jun 26, 2021, 12:15 PM IST

ABOUT THE AUTHOR

...view details