భారత మాజీ రాష్ట్రపతి, సీనియర్ రాజకీయవేత్త ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల పలువురు రాష్ట్ర మంత్రులు సంతాపం తెలిపారు. రాజకీయ కురువృద్ధుడు, భారతర్న, ప్రణబ్ ముఖర్జీ మృతి రాజకీయాలకు తీరని లోటు అని పేర్కొన్నారు.
నిరంజన్ రెడ్డి
భారత మాజీ రాష్ట్రపతి, సీనియర్ రాజకీయవేత్త ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల మంత్రి నిరంజన్రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నానని తెలిపారు. భారత రాజకీయాల్లో భీష్మాచార్యులు ప్రణబ్ ముఖర్జీ అని గుర్తు చేశారు. యావత్ తెలంగాణ సమాజం ప్రణబ్ ముఖర్జీని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని మంత్రి పేర్కొన్నారు.
జగదీశ్ రెడ్డి
ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగధీశ్రెడ్డి సంతాపం ప్రకటించారు. అయన మరణం దేశానికి తీరనిలోటని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో భాగస్యాములైన మహానేత మరణం బాధకరమన్నారు. తెలంగాణ సమాజం ప్రణబ్ ముఖర్జీని ఎప్పటికీ మరవదన్నారు.