కరోనా టీకాలు అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. హైదరాబాద్ ట్యాంక్బండ్లోని బుద్దుడి విగ్రహం వద్ద బౌద్ధానికి సంబంధించిన క్యాలెండర్ను ఆయన విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. బౌద్ధ మతానికి అత్యంత ప్రాముఖ్యత ఉందని... మన దేశం నుంచి బౌద్ధం విదేశాలకు సైతం చేరిందని ఈటల పేర్కొన్నారు.