తెలంగాణ

telangana

రోజుకు పదిలక్షల మందికి కరోనా టీకా: మంత్రి ఈటల

కరోనా వ్యాక్సిన్ తయారీతో తెలంగాణ కీర్తి.. పతాక స్థాయికి ఎదిగిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీకి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని చెప్పారు. హైదరాబాద్ ట్యాంక్​బండ్​లోని బుద్దుడి విగ్రహం వద్ద బౌద్ధానికి సంబంధించిన క్యాలెండర్​ను మంత్రి కొప్పులు ఈశ్వర్​తో కలిసి విడుదల చేశారు.

By

Published : Jan 3, 2021, 5:17 PM IST

Published : Jan 3, 2021, 5:17 PM IST

Updated : Jan 3, 2021, 8:34 PM IST

ministers-etela-rajender-and-koppula-eshwar-release-the-buddhist-calendar-at-tankbund
రోజుకు పదిలక్షల మందికి కరోనా టీకా: మంత్రి ఈటల

రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్ అందించే తాఖతు ఉంది: ఈటల

కరోనా టీకాలు అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. హైదరాబాద్ ట్యాంక్​బండ్​లోని బుద్దుడి విగ్రహం వద్ద బౌద్ధానికి సంబంధించిన క్యాలెండర్​ను ఆయన విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. బౌద్ధ మతానికి అత్యంత ప్రాముఖ్యత ఉందని... మన దేశం నుంచి బౌద్ధం విదేశాలకు సైతం చేరిందని ఈటల పేర్కొన్నారు.

నిన్న డ్రైరన్ నిర్వహించాం. 10వేల మందికి ఇందులో శిక్షణ ఇప్పించి... ఎన్ని లక్షల మందికైనా.. ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వడానికి మనకు ఆ తాఖతు ఉంది. వ్యాక్సినేషన్​లో గొప్ప పేరుపొందిన రాష్ట్రం తెలంగాణ.

-- ఈటల రాజేందర్, వైద్యారోగ్య శాఖ మంత్రి

ఇదీ చూడండి:కొవాగ్జిన్​కు డీసీజీఐ గ్రీన్​సిగ్నల్.. త్వరలోనే పంపిణీ

Last Updated : Jan 3, 2021, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details