పార్లమెంట్ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు సాధించి దిల్లీలో తెరాసజెండా ఎగరేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్లో రేపు జరగబోయే పార్లమెంటరీ సన్నాహక సమావేశ ఏర్పాట్లను పార్టీ శ్రేణులతో కలసి పరిశీలించారు. తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. ఏ ఎన్నికల్లోనైనా పార్టీని గెలిపించగల సమర్థ నాయకుడు కేటీఆర్ అని ప్రశంసించారు.
దిల్లీలో తెరాస జెండా ఎగరేస్తాం: తలసాని - తలసాని శ్రీనివాస్ యాదవ్
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా తెరాస సమావేశాలు నిర్వహిస్తోంది. రేపు సికింద్రాబాద్లో జరగబోయే తెరాస పార్లమెంటరీ సన్నాహక సమావేశానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఎమ్మెల్యేలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
తలసాని శ్రీనివాస్