Talasani Srinivas Yadav Spoke In Budget Speech: రాయితీలపై చేప పిల్లలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 6వతేదీన శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టిన బడ్జెట్పై.. గత రెండు రోజులుగా చర్చ సాగుతోంది. మూడోరోజు సభ ప్రారంభమైన సభలో మాట్లాడుతూ తలసాని శ్రీనివాస్ యాదవ్ విపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
2021-22 ఆర్థిక సంవత్సరంలో 4.4 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. అయితే ఆ సంవత్సరం 3.89 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని సాధించామని గర్వంగా చెప్పుకున్నారు. అదే 2022-23 సంవత్సరానికి 4.67 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్ధారించుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెంచడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాయితీపై చేప పిల్లలను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని వ్యాఖ్యానించారు.