తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిత్యావసర సమస్యలుంటే వెంటనే పరిష్కరించండి' - లాక్​డౌన్​ పరిస్థితులపై మంత్రి తలసాని సమీక్ష

లాక్​డౌన్​తో ప్రజలు నిత్యావసరాలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే స్పందించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. తన కార్యాలయంలో గ్రేటర్ పరిధిలో టెలికాన్ఫరెన్స్​లో ప్రజా ప్రతినిధులకు ఆయన పలు సూచనలు చేశారు.

minister talasani srinivas yadav review
'నిత్యావసర సమస్యలుంటే వెంటనే పరిష్కరించండి'

By

Published : Apr 1, 2020, 5:00 PM IST

హైదరాబాద్ నగరంలో కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలపై... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. మసాబ్ ట్యాంక్​లోని తన కార్యాలయం నుంచి గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. లాక్​డౌన్ అమలు జరుగుతున్న తీరును ప్రజాప్రతినిధుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సమస్యలేమైనా ఉంటే వెంటనే స్పందించాలని సూచించారు.

ఇవీ చూడండి:కరోనా గురించి అంతుచిక్కని 5 రహస్యాలివే..

ABOUT THE AUTHOR

...view details