తెలంగాణ

telangana

ETV Bharat / state

TALASANI: 'మత్స్యకారులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు' - telangana latest news

రాష్ట్రంలో మత్స్యకారులపై దాడుల నియంత్రణకు సమగ్ర విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అభిప్రాయం వ్యక్తం చేశారు. మత్స్యకారులపై దాడులకు పాల్పడినా.. మత్స్య సంపదకు నష్టం కలిగించినా.. అలాంటి వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు మత్స్యకార సంఘాల ప్రతినిధులతో మంత్రి సమావేశయ్యారు.

తలసాని సమీక్ష
తలసాని సమీక్ష

By

Published : Aug 7, 2021, 10:37 PM IST

రాష్ట్రంలో మత్స్యకారులపై దాడులకు పాల్పడినా.. మత్స్య సంపదకు నష్టం కలిగించినా.. అలాంటి వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ మాసబ్​ట్యాంకులోని పశు సంక్షేమ భవన్‌లో మత్స్యకార సంఘాల ప్రతినిధులతో మంత్రి సమావేశయ్యారు. రాష్ట్రంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, పరిష్కార మార్గాలపై విస్తృతంగా చర్చించారు.

మత్స్యకారులపై దాడుల నియంత్రణకు, చేపల చెరువుల లూఠీలు జరగకుండా అరికట్టేందుకు సమగ్ర విధానం తీసుకు రావాల్సిన అవసరం ఉందని మంత్రి తలసాని అభిప్రాయం వ్యక్తం చేశారు. మత్స్యకారుల సమస్యలను గుర్తించి.. పరిష్కరించేందుకు అడుగులు వేస్తున్న ప్రభుత్వం.. 10 మంది మత్స్యకార ప్రతినిధులతో ఓ కమిటీ నియమించిందని తెలిపారు. మత్స్యకారులు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని.. అందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప పిల్లల పంపిణీ జరుగుతుందని మంత్రి చెప్పారు.

వ్యాపార అవకాశాలు పెంపొందించే లక్ష్యంతో ..

రాష్ట్రంలో భారీగా పెరిగిన మత్స్య సంపదతో మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడిందని తలసాని సంతోషం వ్యక్తం చేశారు. తక్కువ ధరలకు దళారులకు చేపలు విక్రయించి నష్టపోతున్న మత్స్యకారులను ఆదుకునే ఉద్దేశంతో మత్స్య ఫెడరేషన్ ద్వారా మత్స్య సొసైటీల నుంచి నేరుగా చేపల కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వ్యాపార అవకాశాలు పెంపొందించే లక్ష్యంతో తెలంగాణ నుంచి చేపలు, రొయ్యలు ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేసే అంశం ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: Govt Help: మ్యాన్​హోల్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం

ABOUT THE AUTHOR

...view details