తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీలో బడిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి - Minister talasani outraged over issues in public school

బేగంపేట పరిధిలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు పడుతున్న సమస్యలను తెలుసుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు.

Minister talasani outraged over issues in public school at begumpet
ప్రభుత్వ పాఠశాలలో సమస్యలపై మంత్రి ఆగ్రహం

By

Published : Feb 10, 2020, 12:50 PM IST

బేగంపేట పరిధిలోని ఓల్డ్ కస్టమ్ బస్తీలో ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. మరుగుదొడ్లు, లైట్లు, నీటి వసతి, డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థులు మంత్రికి విన్నవించారు.

సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాల విషయంలో లోటు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో సమస్యలపై మంత్రి ఆగ్రహం

ఇదీ చూడండి :భార్య కళ్ల ముందే భర్తను చంపేశారు..

ABOUT THE AUTHOR

...view details