తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వందకుపైగా సీట్లు గెలుస్తాం: తలసాని - హైదరాబాద్ సమాచారం

గ్రేటర్​ ఎన్నికల్లో వందకుపైగా సీట్లను తెరాస కైవసం చేసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి వరదసాయం ఒక్కరూపాయి అందలేదని అన్నారు. జీహెచ్​ఎంసీలో మాకు ప్రధాన పోటీ కాంగ్రెస్​తోనేనని వెల్లడించారు.

Minister Talasani comments on GHMC Elections
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వందకుపైగా సీట్లు గెలుస్తాం: తలసాని

By

Published : Nov 18, 2020, 8:57 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు ప్రధానపోటీ కాంగ్రెస్​తోనేనని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ వెల్లడించారు. గ్రేటర్​లో తెరాస వందకుపైగా సీట్లు సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి వరదసాయాన్ని నిలిపివేయించారని అన్నారు. కేంద్రం నుంచి నయాపైసా సాయం అందలేదని తెలిపారు.

కొన్ని పార్టీలు ప్రభుత్వంపై కావాలనే విషప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత కూడ వరదసాయం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. మీసేవల ద్వారా దరఖాస్తు చేసుకున్న బాధితుల ఖాతాల్లో డబ్బులు వేశామన్నారు. కిషన్​రెడ్డి కేంద్ర మంత్రి అయ్యాక రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో మా కుటుంబసభ్యులెవరూ పోటీ చేయడం లేదని మంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:'వరదసాయం పేరుతో... ప్రభుత్వం ప్రజలను వేధిస్తోంది'

ABOUT THE AUTHOR

...view details