తెలంగాణ

telangana

ETV Bharat / state

కష్టాలను మరిచిపోయి సంతోషంగా జరుపుకుందాం : తలసాని - క్రిస్​మస్​ కానుకలను పంపిణీ చేసిన తలసాని

ఈ ఏడాది ఎదురైన కష్టాలను మరిచిపోయి సంతోషంగా పండుగ జరుపుకోవాలంటూ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పేర్కొన్నారు. కరోనా, వరదల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. క్రిస్​మస్​ సందర్భంగా సికింద్రాబాద్​లోని ఆల్ఫా హోటల్ వద్ద ఎస్పీజీ చర్చిలో క్రైస్తవులకు కానుకలను ఆయన పంపిణీ చేశారు.

minister talasani christmas gifts distribution in secunderabad spg church
కష్టాలను మరిచిపోయి సంతోషంగా జరుపుకుందాం : తలసాని

By

Published : Dec 22, 2020, 1:39 PM IST

ఈ ఏడాది కరోనా, వరదల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. కష్టాలను మరిచిపోయి పండుగలను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రిస్​మస్​ను పురస్కరింంచుకుని సికింద్రాబాద్​లోని ఆల్ఫా హోటల్ వద్ద ఎస్పీజీ చర్చిలో క్రైస్తవులకు అందజేశారు.

కరోనా మహమ్మారి అంతం అవ్వాలని ఆయన ఆకాంక్షించారు. పేద, మధ్య తరగతి ప్రజలు పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కానుకలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉందని తెలిపారు. క్రిస్​మస్​ సందర్భంగా క్రైస్తవ సోదరులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇదీ చూడండి:రాబోయే మూడు రోజులు బీ అలర్ట్​.. పెరగనున్న చలి తీవ్రత

ABOUT THE AUTHOR

...view details