రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిన రోజు వేడుకలను హైదరాబాద్ చైతన్యపురిలో ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డివిజన్లోని యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు.
చైతన్యపురి డివిజన్లో మంత్రి తలసాని జన్మదిన వేడుకలు
తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలను హైదరాబాద్ చైతన్యపురిలో ఘనంగా నిర్వహించారు. మంత్రి పుట్టినరోజు సందర్భంగా కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో.. రక్తదాన శిబిరం నిర్వహించారు.
![చైతన్యపురి డివిజన్లో మంత్రి తలసాని జన్మదిన వేడుకలు minister talasani birthday celebrations in chaitanyapuri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9069430-207-9069430-1601973954152.jpg)
చైతన్యపురి డివిజన్లో మంత్రి తలసాని జన్మదిన వేడుకలు
అనంతరం జీహెచ్ఎంసీ కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ప్రభాత్నగర్ కాలనీలో మొక్కలు నాటి, అనాథ పిల్లలకు పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి:చపాతీలో మత్తు కలిపారు.. ఉన్నదంతా దోచేశారు