తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆసియాలోనే అతిపెద్ద టూరిజం ప్రాజెక్ట్​ ప్రారంభం : శ్రీనివాస్​గౌడ్

రాష్ట్రాన్ని ఎకో టూరిజం హబ్​గా తీర్చిదిద్దుతామని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక స్థలాల అభివృద్ధిపై హైదరాబాద్ రవీంద్రభారతిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

By

Published : Jan 21, 2021, 8:43 PM IST

minister srinivasa goud review on tourism developments works in the state
అధికారులతో టూరిజంపై మంత్రి సమీక్ష

ఆసియాలోనే అతిపెద్ద టూరిజం స్పాట్​ బుద్ధవనం ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభిస్తామని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్ తెలిపారు. భవిష్యత్తులో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. పర్యాటక స్థలాల అభివృద్ధిపై హైదరాబాద్ రవీంద్రభారతిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రాన్ని ఎకో టూరిజం హబ్​గా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలోని పలు పర్యాటక స్థలాల అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. సర్దార్​ సర్వాయ్ పాపన్న కోట మరమ్మతులకు రూ.కోటి 26 లక్షలు, జోగులాంబ ఆలయ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు రూ.36 కోట్ల 73 లక్షలు, నేలకొండపల్లిలో అభివృద్ధి పనులకు రూ.కోటి 36 లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చూడండి :నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే: భట్టి విక్రమార్క

ABOUT THE AUTHOR

...view details