తెలంగాణ

telangana

ETV Bharat / state

'పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత తెరాసదే' - షాధీ ముబారక్​ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్​ సరూర్​నగర్​లో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు. తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో 38 మందికి చెక్కులు అందజేశారు. పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత తెరాసకే దక్కిందని పేర్కొన్నారు.

minister sabitha indra reddy distribute kalyana laxmi-shadi mubarak-cheques hyderabad
'పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత తెరాసదే'

By

Published : Oct 7, 2020, 6:36 PM IST

పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్ సరూర్​నగర్​లో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో 38 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

కరోనా వైరస్ కారణంగా భౌతిక దూరం పాటిస్తూ లబ్ధిదారులు చెక్కులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సరూర్​నగర్ కార్పొరేటర్ అనిత దయాకర్​ రెడ్డి, ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, ఆర్డీవో రవీందర్ రెడ్డి, ఎమ్మార్వో తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ప్రభుత్వ సంస్థలే రైతుల వద్దకు వస్తాయి: కేసీఆర్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details