తెలంగాణ

telangana

ETV Bharat / state

'సంక్రాంతి అంటేనే... పతంగుల పండుగ' - కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

minister-mallareddy-distributed-kites-to-kida-in-secundrabad
'సంక్రాంతి అంటేనే... పతంగుల పండుగ'

By

Published : Jan 13, 2020, 3:33 PM IST

'సంక్రాంతి అంటేనే... పతంగుల పండుగ'

ఈ సంక్రాంతి రాష్ట్ర ప్రజల ఇళ్లలో ఆయురారోగ్యాలు, సుఖ శాంతులు తీసుకురావాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

సికింద్రాబాద్​ బోయిన్​పల్లిలో టింకూగౌడ్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు పతంగులు పంపిణీ చేశారు. కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏడాది సంక్రాంతి పర్వదినాన బోయిన్​పల్లిలోని పేద పిల్లలకు గాలి పటాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ అని, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా ఆనందంగా ఈ పండుగను జరుపుకోవాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తెరాసకు మద్దతు పలుకుతున్నారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details