ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ప్రజారంజకంగా ఉందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
అన్నివర్గాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్: మంత్రి మల్లారెడ్డి - రాష్ట్ర బడ్జెట్పై మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ను రూపొందించారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. స్థానిక సంస్థల బలోపేతమే లక్ష్యంగా పెద్ద మొత్తంలో నిధులను కేటాయించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.

అన్నివర్గాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్: మంత్రి మల్లారెడ్డి
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ను రూపొందించాని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ బడ్జెట్లో మండల, జిల్లా పరిషత్లకు రూ. 500 కోట్లు కేటాయించడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల బలోపేతమే లక్ష్యంగా పెద్ద మొత్తంలో నిధులను కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ మండలాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ప్రైవేటు సంస్థలకు దీటుగా విజయ డైరీని నడిపిస్తున్నాం: తలసాని