అతి త్వరలోనే మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని... పురపాలక మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఎంసీఆర్హెచ్ఆర్డీలో గ్రేటర్లో రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాలపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు.
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని... పనులు ఇంకా వేగవంతంగా చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ఇప్పటికే 80శాతానికి పైగా నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటికే కొన్నిచోట్ల లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ చేయడం జరిగిందని ఆయన వివరించారు.