తెలంగాణ

telangana

ETV Bharat / state

80శాతానికి పైగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు పూర్తి: కేటీఆర్​ - KTR NEWS

రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. సమావేశానికి మంత్రులు మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, తలసాని, మల్లారెడ్డి, మేయర్ రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్​కుమార్​, జలమండలి ఎండీ హాజరయ్యారు.

minister-ktrs-review-of-construction-of-two-bedroom-houses-in-hyderabad
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

By

Published : May 20, 2020, 12:25 PM IST

Updated : May 20, 2020, 1:10 PM IST

అతి త్వరలోనే మిగిలిన డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని... పురపాలక మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఎంసీఆర్​హెచ్​ఆర్డీలో గ్రేటర్​లో రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాలపై మంత్రి కేటీఆర్​ సమీక్షించారు.

డబుల్ ​బెడ్​రూమ్​ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని... పనులు ఇంకా వేగవంతంగా చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్​ నగరంలో చాలా చోట్ల ఇప్పటికే 80శాతానికి పైగా నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటికే కొన్నిచోట్ల లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ చేయడం జరిగిందని ఆయన వివరించారు.

ఈ సమీక్షకు మంత్రులు ప్రశాంత్​రెడ్డి, తలసాని శ్రీనివాస్​యాదవ్​, మహమూద్​ అలీ, మల్లారెడ్డి, మేయర్​ బొంతు రామ్మోహన్​, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్ హాజరయ్యారు.

రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

ఇదీ చూడండి:ప్రపంచ ఆరోగ్య సంస్థలో భారత్‌కు కీలక పదవి

Last Updated : May 20, 2020, 1:10 PM IST

ABOUT THE AUTHOR

...view details