గ్రేటర్లో హెల్త్ క్యాలెండర్ను రూపొందించాలని మంత్రి పేర్కొన్నారు. జీడిమెట్లలో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ను దీపావళి సందర్భంగా ప్రారంభించనున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఫతుల్లాగూడలో ఏర్పాటు చేయనున్న సీ అండ్ డీ ప్లాంట్ కేంద్రానికి రహదారి ఏర్పాటు సమస్యను వెంటనే పరిష్కరించాలని కమిషనర్ను ఆదేశించారు. నగరంలో రూ.160 కోట్ల వ్యయంతో చేపట్టిన జవహర్నగర్ క్యాపింగ్ పనులు దాదాపుగా పూర్తి అవుతున్నాయని తెలిపారు.
హైదరాబాద్ను పారిశుద్ధ్య నగరంగా మార్చేందుకు ప్రణాళికలు... - KTR REVIEW
హైదరాబాద్లో శానిటేషన్ను మరింత మెరుగుపర్చాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రి... ప్రతి వార్డుకు, సర్కిల్కు శానిటేషన్ ప్రణాళికను తయారు చేయాలని సూచించారు. నగరంలో మరిన్ని చెత్త తరలింపు కేంద్రాలు, డంపింగ్ యార్డుల ఏర్పాటుకు స్థలాలను సేకరించాలని పేర్కొన్నారు.

MINISTER KTR REVIEW ON HYDERABAD SANITATION
పారిశుద్ధ్య నగరంగా మార్చేందుకు ప్రణాళికలు....
సమీక్షా సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కొనసాగుతున్న సమ్మె... ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ
Last Updated : Oct 6, 2019, 7:53 AM IST