owaisi midhani flyover : జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఓవైసీ, మిధాని జంక్షన్లలో... నిర్మాణమైన పైవంతెనను కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ పైవంతెన నిర్మాణాన్ని... 2018లో చేపట్టారు. రూ.63 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమై... రెండున్నరేళ్ల కాలంలో పూర్తైన ఈ ప్రాజెక్టుకు 80 కోట్ల వ్యయమైంది. డీఆర్డీఎల్, మిధాని కూడలి నుంచి ప్రారంభమయ్యే ఈ పైవంతెన... 1.365 కిలోమీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో మూడు వరుసల వంతెనగా నిర్మితమైంది.
వీరికి ఉపయోగం...
మెహదీపట్నం, చాంద్రాయణగుట్ట, మిధాని నుంచి వచ్చే వాహనదారులు... ఈ పైవంతెన ద్వారా మందమల్లమ్మ, సంతోష్నగర్, సాగర్ రింగ్ రోడ్డు, ఎల్బీనగర్ ప్రాంతాలకు సునాయాసంగా చేరుకోవచ్చు. ఈ ఫ్లైఓవర్ ద్వారా చాంద్రాయణగుట్ట - కర్మాన్ఘాట్ మార్గాల గుండా వెళ్లే వాహనదారులకు ఇంధన వ్యయం, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని హర్షం వ్యక్తమవుతోంది.