తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రగతిభవన్‌లో డ్రై డే.. పరిసరాలు శుభ్రపరిచిన మంత్రి కేటీఆర్ - minister ktr conduct dry day program at pragathi bhavan in hyderabad

సీజనల్ వ్యాధులపై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రగతిభవన్​లో డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ktr
పరిసరాల పరిశుభ్రతలో మంత్రి కేటీఆర్​

By

Published : Jun 7, 2020, 3:18 PM IST

ఇళ్లలో పేరుకుపోయిన నీటిపై దోమలు వేగంగా వ్యాప్తిచెందే అవకాశం ఉందని.. ప్రతి ఒక్కరూ తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి కేటీఆర్​ సూచించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా... సీజనల్ వ్యాధుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రతివారం కేవలం పది నిమిషాల పాటు తమ ఇంటి పరిశుభ్రత, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కేటాయిస్తే వర్షాకాలంలో వచ్చే అన్ని రకాల సీజనల్ వ్యాధులను అరికట్టే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.

ప్రగతిభవన్​లో డ్రై డే కార్యక్రమాన్ని మంత్రి నిర్వహించారు. ప్రగతి భవన్ పరిసరాల్లో ఉన్న వర్షపు నీటిని తొలగించారు. రానున్న వర్షాకాలంలోవ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున... ఇందుకు ప్రధాన కారణమైన దోమలను అరికట్టాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు.

పరిసరాల పరిశుభ్రతలో మంత్రి కేటీఆర్​

ఇదీ చూడండి:లైవ్​ వీడియో: పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details