తెలంగాణ

telangana

ETV Bharat / state

సుస్థిరాభివృద్ధి తెరాసతోనే సాధ్యం: కొప్పుల

శాంతికి భంగం కలిగించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండటమే గాక, అటువంటి శక్తులను ఎండగట్టాలని మంత్రి కొప్పుల ఈశ్వర్​ సూచించారు. ఈ మేరకు క్రిస్టియన్​ మత ప్రముఖులతో ఆయన సమావేశమయ్యారు. మతవిద్వేషాలను రెచ్చగొడుతున్న భాజపాని ఎన్నికల్లో ఓడించాలని పేర్కొన్నారు. క్రైస్తవ మతస్థుల అభివృద్ధి కోసం కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని తెలిపారు. ​

By

Published : Nov 27, 2020, 2:18 PM IST

minister koppula meeting with christian elders
రాష్ట్రంలో శాంతి నెలకొంటేనే సుస్థిరాభివృద్ధి సాధ్యం: కొప్పుల

శాంతికి భంగం కలిగించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి, అటువంటి ప్రయత్నాలను ఎండగట్టాలని మంత్రి కొప్పులు ఈశ్వర్ పేర్కొన్నారు. నగరంలో క్రైస్తవ మత ప్రముఖులతో సమావేశమైన ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్​కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని మత పెద్దలు ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మత మౌఢ్యంతో దుందుడుకుగా వ్యవహరిస్తున్న భాజపాని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడించాలని సూచించారు. రాష్ట్రంలో శాంతి నెలకొంటేనే సుస్థిరాభివృద్ధి సాధ్యమౌతుందని పేర్కొన్నారు. ఈ ఆరున్నరేళ్లలో తెలంగాణ, హైదరాబాద్ నగరం గణనీయంగా అభివృద్ధి చెందిందని మంత్రి వివరించారు.

క్రైస్తవుల అభివృద్ధికి

నగరంలో చర్చి నిర్మాణానికి సీఎం కేసీఆర్.. రెండెకరాల భూమితో పాటు రూ. 2 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. అలాగే శ్మశాన వాటికల కోసం 62 ఎకరాలను సేకరించామని పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఈ ఏడాది కూడా రెండున్నర లక్షల మంది పేదలకు దుస్తుల పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో శాంతి నెలకొంటేనే సుస్థిరాభివృద్ధి సాధ్యం: కొప్పుల

ఇదీ చదవండి:నమూనా క్షిపణి మిస్​ ఫైర్.. భయాందోళనకు గురైన స్థానికులు..

ABOUT THE AUTHOR

...view details