ఆలయ భూముల ఆక్రమణదారులను ఉపేక్షించేది లేదని, కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయ భూముల రక్షణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు మంత్రికి వివరించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ ద్వారా 2676 ఎకరాల ఆలయ భూములను గుర్తించి... 181 ఆలయ భూములకు రక్షణ సరిహద్దు బోర్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని నిరుపయోగంగా ఉన్న ఆలయ భూముల్లో ఐదు కోట్ల రూపాయలతో వాణిజ్య సమూదాయాలను నిర్మించే ప్రతిపాదనలకు మంత్రి ఆమోదం తెలిపారు. దేవాదాయ శాఖ భూములు పరాధీనం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్న మంత్రి... హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో దేవాదాయ శాఖ చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సత్ఫాలితాల్ని ఇచ్చిందన్నారు. దీనిని మరింత విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ భూముల రక్షణ విషయంలో దేవాదాయ శాఖ అధికారులు అలసత్వం వీడాలని మంత్రి స్పష్టం చేశారు. భూముల రక్షణకు సంబంధించి దేవాదాయశాఖ అధికారులు సరిహద్దు బోర్డులను ఏర్పాటు చేయాలని... అవసరమైతే పోలీసు, రెవెన్యూ అధికారుల సహాకారం తీసుకోవాలని సూచించారు. దేవుడి భూముల లెక్కలు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు...