Harish rao at Fever Hospital: పేదలకు వైద్యం అందించడంలో మూడో స్థానంలో ఉన్నామని కేంద్రమంత్రే చెప్పారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో ఓపీ బ్లాక్ నిర్మాణానికి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వాస్పత్రిలో పేదలు చనిపోతే ఇంటికి పంపేందుకు కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత కింద అంబులెన్స్లు ఇచ్చిన సంస్థలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రిలో మార్చురీల అభివృద్ధికి రూ. 60 లక్షలు, డయాలసిస్ విభాగానికి రూ. 50 లక్షలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కరోనా సమయంలో వైద్య సిబ్బంది చాలా కష్టపడ్డారన్న ఆయన.. హైదరాబాద్లో నలువైపులా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
సమర్థవంతంగా ఎదుర్కొన్నాం
"కరోనా విపత్కర సమయంలో వైద్యసిబ్బంది కృషి ఎనలేనిది. థర్డ్ వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఫీవర్ సర్వే ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. పేదలకు వైద్యం అందించడంలో మూడో స్థానంలో ఉన్నామని కేంద్రమంత్రే చెప్పారు. ఫీవర్ ఆస్పత్రిలో ఓపీ బ్లాక్ నిర్మాణానికి రూ. 11 కోట్లు కేటాయించాం. గడ్డి అన్నారంలో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయబోతున్నాం. నిమ్స్లో మరో 1000 నుంచి 1500 పడకల కొత్త బ్లాక్ను ఏర్పాటు చేయనున్నాం." -హరీశ్ రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి
మార్చురీల ఆధునికీకరణ