ఎల్బీ స్టేడియంలో జరగనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభకు తెరాస శ్రేణులు భారీగా తరలి వెళ్తున్నాయి. సభా ప్రాంగణానికి చేరుకునేందుకు మంత్రి గంగుల కమలాకర్ కార్యకర్తలతో కలిసి పెద్దఎత్తున ర్యాలీగా వెళ్లారు.
సీఎం సభకు ర్యాలీగా వెళ్లిన మంత్రి గంగుల - గ్రేటర్ ఎన్నికలు 2020 ప్రచారం
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరగనున్న సీఎం బహిరంగ సభకు మంత్రి గంగుల కమలాకర్ ర్యాలీగా వెళ్లారు. హిమాయత్నగర్ డివిజన్ అభ్యర్థి హేమలత యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీకి భారీగా కార్యకర్తలు హాజరయ్యారు.
![సీఎం సభకు ర్యాలీగా వెళ్లిన మంత్రి గంగుల Minister Gangula who went to the CM's meeting as a rally to lb stadium in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9696149-717-9696149-1606565583417.jpg)
సీఎం సభకు ర్యాలీగా వెళ్లిన మంత్రి గంగుల
హిమాయత్నగర్ డివిజన్ తెరాస అభ్యర్థి హేమలత యాదవ్ ఆధ్వర్యంలో కింగ్ కోఠి నుంచి ఎల్బీ స్టేడియం వరకు చేపట్టిన ర్యాలీకి భారీసంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ఈ ర్యాలీలో మంత్రి గంగులతో పాటు కరీంనగర్ మేయర్ ఆనంద్రావు పాల్గొన్నారు. డప్పుల చప్పుళ్లతో మహిళలు, యువకులు పెద్దసంఖ్యలో సభాస్థలికి చేరుకున్నారు.