చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం కొనసాగించాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని నారాయణగూడలో బీసీ సంక్షేమసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాదీక్షకు ఆయన హాజరయ్యారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ లేకపోవడం దారుణమన్నారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు సాధనకు బీసీలందరూ సన్నద్ధం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. సదస్సులో బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, కాంగ్రెస్ సీనియర్నేత వీహెచ్ పాల్గొన్నారు. బీసీల డిమాండ్ల పరిష్కారం కోసం దిల్లీలో దీక్ష చేపడితేనే కేంద్రం దిగివస్తుందని గంగుల అన్నారు.
మార్చి మొదటి వారంలో అన్ని కుల, ఉద్యోగ సంఘాలు, రాజకీయ నాయకులను ఐక్యం చేసి ఛలో దిల్లీ కార్యక్రమం చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ ఉద్యమంలో భాజపా ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ పాల్గొనాలని మంత్రి కోరారు. కేంద్రం బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి : ఆర్.కృష్ణయ్య