తెలంగాణ

telangana

ETV Bharat / state

రహదారుల నిర్మాణంపై మంత్రి ఎర్రబెల్లి సమీక్షా సమావేశం - పీఎంజీఎస్​వై పనులపై మంత్రి ఎర్రబెల్లి సమావేశం

పీఎంజీఎస్​వై పనుల పురోగతి గురించి ఇంజినీరింగ్​ శాఖ అధికారులతో పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు సమీక్షించారు. రాష్ట్రానికి మంజూరైన రహదార్లను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

minister errabelli meeting on road construction at hyderabad
రహదారుల నిర్మాణంపై మంత్రి ఎర్రబెల్లి సమీక్షా సమావేశం

By

Published : Oct 16, 2020, 8:01 PM IST

ప్రధానమంత్రి గ్రామీణ సడక్​ యోజన కింద రాష్ట్రానికి మంజూరైన రహదారులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్​ శాఖ అధికారులతో సమావేశమైన మంత్రి... పీఎంజీఎస్​వై పనుల పురోగతిని సమీక్షించారు. రాష్ట్రానికి మంజూరైన 158 రోడ్ల పనుల పురోగతిని తెలుసుకుని పనులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

రోడ్డు నిర్మాణం పనుల్లో రాజీపడవద్దని మంత్రి స్పష్టం చేశారు. నిబంధనలకు లోబడి ఉన్న పనులను మొదటి ప్రాధాన్యంగా పూర్తి చేయాలని, ఇబ్బందులు ఉన్న వాటిని రెండో ప్రాధాన్యంగా తీసుకుని సమస్యలు పరిష్కరిస్తూ పూర్తి చేయాలన్నారు. ఆయా పనులను ఉన్నతాధికారులు స్వయంగా పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు.

ఇదీ చదవండిఃకాల్ సెంటర్​ స్కామ్​లో రూ.190 కోట్లు సీజ్: సీబీఐ

ABOUT THE AUTHOR

...view details