తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్యులు ప్రాణాలను పణంగా పెడుతున్నారు: ఈటల - attack on doctors

వైద్యులపై దాడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ చెప్పారు. వైద్యులు వారి ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని గుర్తు చేశారు.

Minister Eetala Rajender respond about patients attck on doctors
వైద్యులు ప్రాణాలను పణంగా పెడుతున్నారు: ఈటల

By

Published : Apr 18, 2020, 12:12 PM IST

కరోనా నుంచి కోలుకున్న బ్రిటన్ ప్రధాని తనకు ఏ దేవుడు లేడు, వైద్యుడే దేవుడు అన్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అలాంటి వైద్యులపై కొందరు మూర్ఖులు దాడి చేస్తున్నారని హైదరాబాద్​లో చెప్పారు.

వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైద్యులు వారి ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని గుర్తు చేశారు.

వైద్యులు కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. తలసేమియా వ్యాధిగ్రస్తులు రక్తం కొరత వల్ల ఇబ్బంది పడుతున్నారని తెలిపిన మంత్రి రక్తదానానికి ప్రజలు ముందుకు రావాలని కోరారు. విపత్కర సమయంలో 200 మంది ఉద్యోగులు రక్తదానం చేయడం హర్షణీయమన్నారు.

ఇదీ చూడండి:సీసీసీకి రామోజీరావు విరాళం.. కృతజ్ఞతలు తెలిపిన చిరు

ABOUT THE AUTHOR

...view details