ఎంఐఎంని గెలిపించిన ఔరంగాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలపై ప్రధాని ఎందుకు వివక్ష చూపుతున్నారో చెప్పాలని ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఈ నెల 8న 5 కంటే ఎక్కువ ఉన్న లోక్సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైందని... హైదరాబాద్, ఔరంగాబాద్ ప్రజలు తక్కువ మంది ఉన్నారని వారి సమస్యలు చెప్పడానికి ఎందుకు అర్హులు కాదని ప్రశ్నించారు. ఒక పార్లమెంటు సభ్యునిగా వారి తరఫున మాట్లాడటం తన బాధ్యత అంటూ అసద్ ట్వీట్ చేశారు.
'మోదీజీ మా నియోజకవర్గాలపై వివక్ష ఎందుకు'
ఔరంగాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలపై ప్రధాని వివక్ష చూపిస్తున్నారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఆ నియోజకవర్గాల్లో మజ్లిస్ గెలవడమే కారణమని విమర్శించారు. ఒక ఎంపీగా వారి తరఫున మాట్లాడటం తన బాధ్యత అంటూ అసద్ ట్వీట్ చేశారు.
asaduddin