తెలంగాణ

telangana

ETV Bharat / state

Vaccination: లక్ష్యానికి చేరువలో.. 6నెలల వ్యవధిలో కోటి 16 లక్షల టీకాలు - mega vaccination drive by medicover hospital

హైదరాబాద్ మెడికోవర్ ఆస్పత్రి నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు అపూర్వ స్పందన లభిస్తోంది. హైటెక్స్ వేదికగా గత నెల 6న సుమారు 40వేల మందికి టీకాలు అందించిన మెడికోవర్... రెండో డోస్ కోసం మళ్లీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ని చేపట్టింది. తక్కువ సమయంలో ఎక్కువ మందికి టీకా పంపిణీ పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వ్యాక్సినేషన్​ డ్రైవ్​లు ముమ్మరంగా సాగుతున్నాయి. 6 నెలల వ్యవధిలో ఇప్పటివరకు కోటికి పైగా టీకాల పంపిణీ పూర్తైంది.

mega vaccination drive
మెగా వ్యాక్సినేషన్​ డ్రైవ్​

By

Published : Jul 4, 2021, 1:22 PM IST

హైదరాబాద్ మెడికోవర్ ఆస్పత్రి మరోసారి మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించింది. సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్​తో కలిసి చేపట్టిన ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌కి హైటెక్స్ వేదికైంది. ఉదయం 8 గంటల నుంచే ప్రారంభమై డ్రైవ్‌లో సుమారు 20వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా గత నెల 6న సుమారు 40వేల మందికి టీకాలు అందించిన మెడికోవర్.. రెండో డోస్ కోసం మళ్లీ వ్యాక్సినేషన్ డ్రైవ్​ చేపట్టింది.

తక్కువ సమయంలో ఎక్కువ మందికి..

టీకా తీసుకోవాలనుకునే వారు నేరుగా హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్‌లో స్పాట్ రిజిస్ట్రేషన్ లేదా ఆన్​లైన్ రిజిస్టర్ చేసుకోవచ్చని మెడికోవర్ ఆస్పత్రి ప్రకటించింది. ప్రభుత్వ కేంద్రాల్లో టీకాలు ఇస్తున్నప్పటికీ వీలైనంత త్వరగా అందరికీ టీకా అందించాలన్న లక్ష్యంతో ఇలాంటి మెగా డ్రైవ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు మెడికోవర్ ప్రతినిధులు తెలిపారు.

జూన్​ 6 తర్వాత మరోసారి మెగా వ్యాక్సినేషన్​ డ్రైవ్​ నిర్వహించాం. రాష్ట్రంలో అందరికీ త్వరితగతిన అందరికీ వ్యాక్సినేషన్​ అందించేలా మా వంతు పాత్ర పోషిస్తున్నాం. మా నుంచి స్ఫూర్తితో ఇతర ఆస్పత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక వ్యాక్సినేషన్​ డ్రైవ్​లను నిర్వహించడం సంతోషంగా ఉంది. మున్ముందు కూడా ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు మరెన్నో చేపడతాం. -అనిల్​ కృష్ణ, మెడికోవర్​ ఎండీ

వైద్యారోగ్య శాఖ గణాంకాలు

రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. గడచిన 24 గంటల్లో లక్షా 56 వేల 195 మందికి తొలిడోస్, 52వేల 416 మందికి రెండో డోస్ వ్యాక్సిన్​ను ప్రభుత్వం అందించింది. దీంతో తాజాగా ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల్లో కలిపి మొత్తం 2లక్షల 8వేల 611 డోసుల టీకాలు పంపిణీ చేసినట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 99 లక్షల 38 వేల 528 మందికి మొదటి డోస్ పూర్తి కాగా, మరో 16లక్షల 91వేల 842 మందికి రెండో డోస్ టీకాలు అందించారు.

6నెలల్లో కోటి 16 లక్షల టీకాలు

రాష్ట్రంలో జనవరి 16 నుంచి ఇప్పటివరకు కోటి 16లక్షల 30వేల 370 డోసుల టీకాలను ప్రజలకు అందజేసినట్టు వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణలో మొత్తం 2.2 కోట్ల మంది టీకా తీసుకునేందుకు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి టీకాలు అందించే లక్ష్యంతో పనిచేస్తున్న సర్కారు.... మొదటి డోసు పంపిణీపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రత్యేక డ్రైవ్​లను ఏర్పాటు చేస్తూ నిత్యం సుమారు రెండు లక్షల మందికి పైగా టీకాలు అందిస్తోంది.

మెగా వ్యాక్సినేషన్​ డ్రైవ్​కు అపూర్వ స్పందన

ఇదీ చదవండి:ఆ ఏటీఎంలో డబ్బు డ్రా చేస్తే ఏమవుతుందో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details