హైదరాబాద్ కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని ఏఎస్ రావు నగర్ అంకుర్ ఆస్పత్రిలో చేరిన ఓ చిన్నారి వైద్యం వికటించి మృతి చెందింది. నిన్న కడుపునొప్పితో రమ్యను అంకుర్ ఆస్పత్రిలో చేర్పించామని తల్లిదండ్రులు తెలిపారు
వైద్యం వికటించి చిన్నారి మృతి - వైద్యం వికటించి చిన్నారి తాజా వార్త
వైద్యం వికటించి రమ్యశ్రీ అనే బాలిక మరణించిన ఘటన హైదరాబాద్ కుషాయిగూడ పీస్ పరిధిలో చోటుచేసుకుంది. తమ కూతురు మృతికి కారణమైన వైద్యులను శిక్షించాలంటూ ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన చేపట్టారు.
![వైద్యం వికటించి చిన్నారి మృతి medicine reaction child dead in Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5464613-381-5464613-1577082158386.jpg)
వైద్యం వికటించి చిన్నారి మృతి
వైద్యులు హెవీ డోస్ ఇంజక్షన్లు ఇవ్వడం కారణంగానే తమ కూతురు చనిపోయిందని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రమ్యశ్రీ చావుకు కారణమైన వైద్యులను కఠినంగా శిక్షించి.. తమకు న్యాయం చేయాలంటూ బంధువుల ఆందోళనకు దిగారు.
వైద్యం వికటించి చిన్నారి మృతి
ఇదీ చూడండి : అంబులెన్స్లోనే పాపకు జన్మనిచ్చిన తల్లి