తెలంగాణ

telangana

By

Published : Nov 12, 2021, 2:24 PM IST

Updated : Nov 12, 2021, 4:37 PM IST

ETV Bharat / state

Jagan in HOspital: ఆస్పత్రికి జగన్‌... విశ్రాంతి అవసరమన్న వైద్యులు.. అసలేమైంది?!

వరుస సమావేశాలు.. పర్యాటనలు.. అధికారులతో సమీక్షలు.. పరిపాలనా వ్యవహరాలు.. పథకాల ప్రారంభోత్సవాలు.. ఇలా నిత్యం బిజీగా ఉంటున్న జగన్​కు.. వైద్యులు పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.. ఇంతకీ జగన్​కు ఏమైందంటే?!

AP CM jagan: ఆస్పత్రికి జగన్‌... విశ్రాంతి అవసరమన్న వైద్యులు.. అసలేమైంది?!
AP CM jagan: ఆస్పత్రికి జగన్‌... విశ్రాంతి అవసరమన్న వైద్యులు.. అసలేమైంది?!

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్ వైద్య పరీక్షల నిమిత్తం తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రి(AP CM JAGAN IN MANIPAL HOSPITAL)కి వెళ్లారు. ఇటీవల ఇంట్లో వ్యాయామం చేస్తుండగా జగన్​ గాయపడ్డారు. అప్పుడు ఎడమ కాలి నొప్పితో బాధపడ్డ జగన్.. మరోసారి కుడి కాలికి వాపు రావడంతో ఆస్పత్రికి వెళ్లారు. వైద్యపరీక్షల కోసం మణిపాల్ ఆస్పత్రికి వెళ్లారు.

అక్కడ వైద్యులతో ఎమ్మారై స్కానింగ్​తోపాటు, జనరల్ చెకప్ చేయించుకున్నారు. సుమారు రెండు గంటలపాటు జగన్​కు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లిపోయారు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో.. విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్షతోపాటు.. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఉన్న సీఎం జగన్ అపాయింట్‌మెంట్లన్నీ ఉన్నతాధికారులు రద్దు చేశారు.

Last Updated : Nov 12, 2021, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details