హైదరాబాద్లోని 150 అన్నపూర్ణ కేంద్రాల్లో గురువారం నుంచి ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. నానక్రామ్గుడా అన్నపూర్ణ సెంట్రల్ కిచెన్ను, సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ నైట్ షెల్టర్ను డిప్యూటీ స్పీకర్ పద్మారావుతో కలిసి మేయర్ పరిశీలించారు.
'అన్నపూర్ణ కేంద్రాల్లో యథావిధిగా భోజనం'
భాగ్యనగరంలో లాక్డౌన్తో మూసేసిన అన్నపూర్ణ కేంద్రాల్లో తిరిగి యథావిధిగా భోజనం అందించనున్నట్లు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. హాస్టళ్ల విద్యార్థులకు, వర్కింగ్పర్సన్స్కు అదనంగా భోజన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
Published : Mar 26, 2020, 6:57 AM IST
Published : Mar 26, 2020, 6:57 AM IST
|Updated : Mar 26, 2020, 9:34 AM IST
హాస్టళ్ల విద్యార్థులు, వర్కింగ్ పర్సన్స్కు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీరికోసం అదనంగా వండి ఇవ్వాలన్న అభ్యర్థనకు అక్షయపాత్ర నిర్వాహకులు సంతోషంగా అంగీకరించారన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో అనాథలు, నిరాశ్రయులకు జీహెచ్ఎంసీ అండగా నిలుస్తోందని మేయర్ తెలిపారు.
ఇదీ చూడండి: సుఖీభవ: ఆయుర్వేదంతో కరోనాను అరికట్టవచ్చా?