తెలంగాణ

telangana

By

Published : May 7, 2021, 8:48 PM IST

ETV Bharat / state

జ్వరం లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి: మేయర్​

హైదరాబాద్​ నగరంలో కరోనా కట్టడికి చేపట్టిన చర్యలపై సంబంధిత అధికారులతో మేయర్​ గద్వాల విజయలక్ష్మి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్వల్ప జ్వరం ఉన్నవారు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మేయర్​ విజయలక్ష్మి సమీక్ష
మేయర్​ విజయలక్ష్మి సమీక్ష

స్వల్ప జ్వరం గానీ, ఒంట్లో నలతగా గానీ ఉంటే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలో కరోనా కట్టడికి చేపట్టిన చర్యలపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో సంబంధిత అధికారులు, గ్రేటర్ పరిధిలోని వైద్యాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.

ఇప్పటికే నగరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాల ద్వారా ఇంటింటికీ ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారని మేయర్ తెలిపారు. ఎవరికైనా స్వల్ప జ్వరం ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో గానీ, అర్బన్ హెల్త్ సెంటర్లలో గానీ, బస్తీ దవాఖానాల్లో గానీ ప్రాథమిక జ్వర పరీక్షలు చేయించుకోవాలని కోరారు. జ్వరమున్న వారికి ఉచితంగా కరోనా నివారణ మందుల కిట్ అందజేస్తున్నారని.. ఈ మందులను 5 రోజుల పాటు వాడాలని పేర్కొన్నారు. నగరంలో పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో బల్దియా ఎంటమాలజీ, డీఆర్ఎఫ్ విభాగాల ద్వారా హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా వాక్సినేషన్​కై ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆన్​లైన్​లో స్లాట్​ బుక్​ చేసుకోవాలన్నారు.

ఇదీ చూడండి:నకిలీ ధ్రువపత్రాలతో కారు లోన్.. హెల్త్ ఇన్​స్పెక్టర్ అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details