తెలంగాణ

telangana

By

Published : Jul 28, 2020, 8:17 PM IST

ETV Bharat / state

కరోనా వస్తే భయపడకండి..దైర్యంగా ఎదుర్కోండి: జీహెచ్​ఎంసీ మేయర్​

కరోనా వస్తే ఆందోళనకు గురికావాల్సిన పనిలేదని జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్​ పేర్కొన్నారు. తనకు పాజిటివ్​ నిర్ధారణ అయిన నాటి నుంచి ఎంతో ధైర్యంగా హోం ఐసోలేషన్​లో ఉంటూ చికిత్స పొందుతున్నానని వెల్లడించారు.

mayor bonthu rammohan spoke about his health and corona
కరోనా వస్తే భయపడకండి..దైర్యంగా ఎదుర్కోండి: జీహెచ్​ఎంసీ మేయర్​

కరోనా పాజిటివ్ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్ అన్నారు. వైద్యుల సలహాలు పాటించి ఇప్పటికి ఎంతో మంది వైరస్​ను జయించారని తెలిపారు.

తనకు పాజిటివ్ వచ్చినా హోం ఐసోలేషన్​లో ఎంతో ధైర్యంగా ఉన్నట్లు మేయర్ వెల్లడించారు. ఇంట్లోనే వ్యాయామం చేస్తూ, ఆరోగ్య సూత్రాలను పాటిస్తున్నానని పేర్కొన్నారు. విటమిన్స్ కలిగిన ఆహారం తింటూ... వైద్యుల సూచనలు పాటిస్తే మహమ్మారి నుంచి బయటపడొచ్చని ఆయన అన్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్‌ కేసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details