నగరంలోని కాప్రా సర్కిల్కు చెందిన జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు ఆండాలు కుటుంబ సభ్యులకు మేయర్ బొంతు రామ్మోహన్ రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇటీవల విధి నిర్వహణలో ఉన్న ఆండాలును మోటార్ సైకిల్ ఢీ కొనగా తీవ్రంగా గాయపడింది. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆమెని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ కార్మికురాలు ఈ రోజు మరణించింది.
కార్మికురాలి కుటుంబానికి రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా - గ్రేటర్లో పారిశుద్ధ్య కార్మికురాలి కుటుంబానికి మేయర్ 2 లక్షల ఎక్స్గ్రేషియా
విధి నిర్వహణలో ప్రమాదానికి గురై మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలి కుటుంబానికి మేయర్ బొంతు రామ్మోహన్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. రూ. 2 లక్షలను అందించనున్నట్లు తెలిపారు. నగరంలోని కాప్రా సర్కిల్కి చెందిన కార్మికురాలు ఆండాలుని.. బైక్ ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ ఆమె ఈ రోజు మృతి చెందింది.
![కార్మికురాలి కుటుంబానికి రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా mayor announces ex gratia for sanitary worker](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9557953-864-9557953-1605513842621.jpg)
పారిశుద్ధ్య కార్మికురాలి కుటుంబానికి రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా
మృతి చెందిన ఆండాలుకు బీమా సౌకర్యం, ఇతర అలవెన్సులతో పాటు ఆమె కుటుంబానికి మేయర్ నిధుల నుంచి ప్రత్యేకంగా రూ. 2 లక్షలను అందజేయనున్నట్లు బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. కార్మికురాలి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:టీఎస్బీపాస్ వెబ్సైట్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్