తెలంగాణ

telangana

ETV Bharat / state

టీఎన్జీవో నూతన అధ్యక్షుడిగా మామిడ్ల రాజేందర్‌ - టీఎన్జీవో నూతన అధ్యక్షుడి తాజా వార్తలు

తెలంగాణ ఎన్జీవో సంఘం నూతన అధ్యక్షుడిగా మామిడ్ల రాజేందర్ ఎన్నికయ్యారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో 33 జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు.. అధ్యక్షుడిగా రాజేందర్‌కు ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. టీఎన్జీవో 11వ అధ్యక్షుడిగా తనకు అవకాశం ఇచ్చి.. ఎన్నుకున్న 33 జిల్లాల అధ్యక్షులు, ఉద్యోగులందరికీ రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు.

టీఎన్జీవో నూతన అధ్యక్షుడిగా మామిడ్ల రాజేందర్‌
టీఎన్జీవో నూతన అధ్యక్షుడిగా మామిడ్ల రాజేందర్‌

By

Published : Aug 31, 2020, 11:11 PM IST

తెలంగాణ ఎన్జీవో సంఘం నూతన అధ్యక్షుడిగా మామిడ్ల రాజేందర్ ఎన్నికయ్యారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో 33 జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు.. అధ్యక్షుడిగా రాజేందర్‌ను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. ఇంతకుముందు కొనసాగిన కారెం రవీందర్ రెడ్డికి సోమవారం ఉద్యోగ పదవీ విరమణ పూర్తి అయింది. సంఘం ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన రాజేందర్‌ నూతన అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

టీఎన్జీవో 11వ అధ్యక్షుడిగా తనకు అవకాశం ఇచ్చి.. ఎన్నుకున్న 33 జిల్లాల అధ్యక్షులు, ఉద్యోగులందరికి రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వంతో అరమరికలు లేకుండా పోరాటం చేస్తామని.. ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీలు వెంటనే ఇవ్వాలని కోరారు. మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని విడుదల చేయడంతో పాటు ఆంధ్రలో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులను వెనక్కి తీసుకురావాలన్నారు. సీపీఎస్ ఉద్యోగుల పోరాటానికి బాసటగా నిలుస్తామని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని.. తమ మొర కూడా ఆలకించాలని కోరారు. కేసీఆర్ బోలా శంకరుడని తమకు రావాల్సిన రాయితీలన్నీ ఇవ్వాలన్నారు.

ఇదీ చదవండి:భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ అస్తమయం

ABOUT THE AUTHOR

...view details