తెలంగాణ

telangana

ETV Bharat / state

'రిజర్వేషన్లు తొలగించేందుకు కేంద్రప్రభుత్వం కుట్ర' - హైదరాబాద్ తాజా వార్తలు

రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను తొలగించేందుకు కేంద్రప్రభుత్వం కుట్ర చేస్తుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు వబ్బతి శ్రీ కృష్ణ అన్నారు. సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్​బాగ్​ ప్రెస్​ క్లబ్​లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

mala mahanadu  round table meeting about reservation in hyderabad
రిజర్వేషన్లు తొలగించేందుకు కేంద్రప్రభుత్వం కుట్ర

By

Published : Jan 11, 2021, 3:46 PM IST

రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను తొలగించేందుకు... కేంద్రప్రభుత్వం కుట్రకు పూనుకుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు వబ్బతి శ్రీ కృష్ణ ఆరోపించారు. ఈ కుట్రను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.

రిజర్వేషన్లపై కేంద్రప్రభుత్వం కుట్రలు అనే అంశంపై మాల మహానాడు ఆధ్వర్యంలో... హైదరాబాద్ బషీర్​బాగ్ ప్రెస్​ క్లబ్​లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రిజర్వేషన్లను కాపాడుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలు చేస్తామని తెలిపారు. ఆయా సంఘాల ప్రజా ప్రతినిధులు సంఘటితంగా కృషిచేయాలని కోరారు.

ఇదీ చదవండి: రైతు బంధు సాయం కింద రూ.7351.74 కోట్లు పంపిణీ

ABOUT THE AUTHOR

...view details