తెలంగాణ

telangana

By

Published : Jul 24, 2020, 2:13 PM IST

ETV Bharat / state

మహీంద్ర యూనివర్శిటీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్​లో నిర్మించిన మహీంద్రా యూనివర్శిటీని మహీంద్రా గ్రూపు సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాతో కలిసి ఆన్​లైన్ మాధ్యమం ద్వారా ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. విశ్వవిద్యాలయం రూపకల్పనలో క్రియాశీలక పాత్ర వహించిన ఆనంద్ మహీంద్రాకు మంత్రి అభినందనలు తెలిపారు.

anand mahindra started mahindra university in hyderabad through online
మహీంద్ర యూనివర్శిటీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్​లో మహీంద్రా యూనివర్శిటీని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మహీంద్రా గ్రూపు సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాతో కలిసి ఆన్​లైన్ మాధ్యమం ద్వారా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఏడాది రాష్ట్రానికి ఆరు ప్రైవేటు యూనివర్శిటీలకు అనుమతులు రాగా అందులో ప్రారంభానికి నోచుకున్న తొలి విశ్వవిద్యాలయంగా మహీంద్ర నిలిచింది.

మహీంద్ర యూనివర్శిటీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

మహీంద్రా గ్రూప్ సంస్థల తరహాలో యూనివర్సిటీ కూడా అత్యున్నత అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను నెలక్పొల్పుతుందని మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇన్నోవేషన్​కు అధిక ప్రాధాన్యమివ్వాలని వర్సిటీ యాజమాన్యానికి కేటీఆర్ సూచించారు. విశ్వవిద్యాలయం రూపకల్పనలో క్రియాశీలక పాత్ర వహించిన ఆనంద్ మహీంద్రాకు మంత్రి అభినందనలు తెలిపారు.

ఇవీ చూడండి:కేటీఆర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్​రావు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details